హైదరాబాద్ శివార్లలోని నార్సింగి ప్రాంతంలో ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. ఒక ప్రజాప్రతినిధి అండతో కబ్జాకు గురైన అత్యంత విలువైన పార్క్ స్థలాన్ని అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రజల సౌకర్యార్థం కేటాయించిన స్థలాలను అక్రమంగా ఆక్రమిస్తే ఊరుకునేది లేదని ఈ చర్య ద్వారా అధికారులు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. నార్సింగిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీలో సుమారు 1,600 గజాల విస్తీర్ణం కలిగిన పార్క్ స్థలాన్ని ఒక ప్రజాప్రతినిధి అక్రమంగా…