తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మిగతా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా వున్నా.. అడవులు, కొండలు, గుట్టలు ఎక్కువగా వుండే ఏజెన్సీ ఏరియాల్లో మాత్రం కష్టంగా నడుస్తోంది. పల్లె ప్రగతి కోసం వెళ్ళిన అధికారులకు రోడు కష్టాలు కళ్ళకు కట్టాయి. వారంతా నడవలేక, కొండలు దాటలేక నానా కష్టాలు పడాల్సి వచ్చింది. మారు మూల ఏజెన్సీ ప్రాంతాలోని గుట్ట లెక్కి మరీ కార్యక్రమం నిర్వహించారు. బండ రాళ్ళు, కొండ గుట్టల మధ్య నుండి గ్రామానికి…