రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంజనీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను కన్వీనర్, సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఐఏఎస్ విడుదల చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు చివరి తేదీ జూలై 8 కాగా.. జూలై 6 నుంచి10 వరకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు 95,654 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోగా, 76,494 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. మొత్తం…
బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ వర్సిటీ ఉపకులపతి కె.ప్రతాప్రెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు. 32,106 మంది ఎడ్సెట్ పరీక్ష రాయగా 30,944 మంది ఉత్తీర్ణత నమోదైంది. అంటే 96.38శాతం అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. మొదటి మూడు స్థానాల్లో అబ్బాయిలదే హవా.