ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జూరాల జలాశయం నుంచి లక్షా 75 వేల క్యూసెక్కులకు పైగా వరద నీటిని దిగువకు విడుదల చేశారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 1,50,900 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.