Hezbollah: గతేడాది సెప్టెంబర్ నెలలో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడిలో హతమైన హిజ్బుల్లా అగ్రనేత హసన్ నస్రల్లా అంత్యక్రియలకు డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 23న అంత్యక్రియలు జరుగుతాయని ఇరాన్ మద్దతు కలిగిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా ప్రస్తుతం చీఫ్ నయీమ్ కస్సేమ్ ఆదివారం తెలిపారు. లెబనాన్ బీరూట్కి సమీపంలోని ఒక బంకర్పై వైమానిక దాడి చేసిన ఇజ్రాయిల్, నస్రల్లాని హతమార్చింది.
లెబనాన్లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తోంది. మొదట సంస్థ అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా, అతని కుమార్తె, అనేక మంది టాప్ కమాండర్లు చంపబడ్డారు. అదే సమయంలో, సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక ఫ్లాట్పై జరిగిన దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించాడు. హిజ్బుల్లాకు చెందిన మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది
లెబనాన్ రాజధాని బీరూట్లోని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేయడంతో మరణించిన అగ్రశ్రేణి హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించనున్నట్లు నివేదికలు తెలిపాయి.