మంత్రి జూపల్లి కృష్ణారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హర్ష వర్ధన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ లో మల్లేష్ ఆనే బీఆర్ఎస్ కార్యకర్తది రాజకీయ హత్య కాకపోతే.. జూపల్లి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు..? అని ఆయన వ్యాఖ్యానించారు. హత్యపై డీజీపీకి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు సరైన రీతిలో విచారణ చేయడం లేదన్నారు హర్షవర్ధన్ రెడ్డి. మల్లేష్ హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను సచివాలయంలో పక్కన కూర్చో పెట్టుకుని…