ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా…
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2019 డిసెంబర్ 31న దుబాయ్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యుల సమక్షంలో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. 2020 జులైలో నటాషా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. 2023 ఫిబ్రవరి 14న హార్దిక్, నటాషాలు రాజస్థాన్లోని ఉదయ్పుర్ ప్యాలెస్లో రెండోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి జరిగిన కొన్ని నెలలకే వీరి మధ్య విభేదాలు రావడంతో 2024…
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు షాక్ తగిలింది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి మ్యాచ్లోనే హార్దిక్కు జరిమానా పడింది. శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి రూ.12 లక్షలు ఫైన్ను ఐపీఎల్ విధించింది. ఈ సీజన్లో తొలి తప్పిదం కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్కు రూ.12 లక్షల జరిమానా విధించాం అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ…
క్రికెట్ ఆటలో గొడవలు, దూషణలు సాధారణం. ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా ఉన్న సమయాల్లో ప్లేయర్స్ మాటలు యుద్దానికి దిగుతుంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతి చేశాడు. ముంబై మాజీ ఆటగాడు, గుజరాత్ ప్లేయర్ సాయి కిశోర్ను ముందు దూషించి.. ఆపై హగ్ ఇచ్చాడు. ఇందుకు సంభందించిన…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా తొమ్మిదవ మ్యాచ్ శనివారం గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ ఉత్కంఠ భరిత మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కాగా.. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో.. జట్టుకు మరింత బలం చేకూరనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో శనివారం (మార్చి 29) జరిగే మ్యాచ్ నంబర్-9లో గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) తలపడనున్నాయి. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్లో గుజరాత్ తన తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (PBKS)తో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్…
IPL 2025: ముంబై ఇండియన్స్ (MI) టీమ్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఈ జట్టు ఇప్పటివరకు 5 ఐపీఎల్ టైటిళ్లను కైవసం చేసుకుని తన సత్తాను చాటుకుంది. ప్రత్యేకంగా, రోహిత్ శర్మ కెప్టెన్సీ హయాంలో ముంబై ఇండియన్స్ అత్యధిక విజయాలను సాధించింది. అయితే, ఐపీఎల్ 2024లో జట్టుకి కొత్త కెప్టెన్ను నియమించింది యాజమాన్యం. దైనితో స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పండ్యా ఇప్పుడు ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహించనున్నాడు. కానీ, ఐపీఎల్ 2025లో…
Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని టీమ్స్ లో కొత్త ఆటగాళ్ల రాకతో ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. టోర్నమెంట్ మొదటి రెండు రోజుల్లోనే రసవత్తరమైన మ్యాచ్లు ఉండబోతుండటంతో క్రికెట్ లవర్స్ ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. మార్చి 22న ఐపీఎల్ 2025 గ్రాండ్ ఓపెనింగ్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య జరగనుంది. మరుసటి రోజు…