ఆగష్టు 15న అంటే నేడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ జెండా వందనం జరిగింది. తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జెండాను ఎగరవేశారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి అణచివేత పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన…