తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సహకారం అందించనుంది ఏపీ ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ సైక్లోన్ వల్ల 34,586 మంది రైతులు పంట నష్టపోయారు. అయితే ఆ రైతుల ఖాతాల్లోకి 22 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం అందించనుంది జగన్ సర్కార్. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. ఈ క్రాప్ ఆధారంగా…
ఇటీవల వచ్చిన గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోలేదు. తీరప్రాంతంలోని గ్రామాలు అనేకం ఇంకా ముంపులోనే ఉన్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. దీంతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చేపల వేటకు వెళ్లే విషయమై మత్స్యకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటిమట్టం పెరిగింది. ఈ గులాబ్ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుఫాన్గా మారి సెప్టెంబర్ 30న పాకిస్థాన్ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్ తుఫాన్ కళింగపట్నం- గోపాలపూర్ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్ దిశగా రావడంతో గుజరాత్లోనూ పక్కనే ఉన్నఖంభాట్ గల్ఫ్లోనూ ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో…
తెలంగాణను గులాబ్ తుఫాన్ వణికించింది. సైక్లోన్ ప్రభావంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్న విధంగా కురిసిన వర్షానికి.. పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. నిన్న రాత్రి నుంచి విరామం లేకుండా కురిసిన కండపోత వానకు భాగ్యనగరం ముగినిపోయింది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. సాయంత్రం నాలుగు గంటలకే నగరంలో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. జడివానతో కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీళ్లొచ్చి చేరాయి. రోడ్లపై…
గులాబ్ తుఫాన్ తెలంగాణలో విధ్వంసమే సృష్టిస్తోంది… ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం సెలవుగా ప్రకటించారు సీఎం కేసీఆర్.. ఇక, అసెంబ్లీ సమావేశాలను కూడా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు.. భారీ వర్షాల వల్ల…
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రేపు సెలవుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉండడంతో.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అయితే, అత్యవసర సేవలకు సంబంధించినవారు మాత్రం విధుల్లో ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్తో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.. ఇక, రేపు అసెంబ్లీ సమావేశాల్లో.. సభను నిర్వహించడంపై…
తెలంగాణపై గులాబ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది.. హైదరాబాద్లో గంటల తరబడి ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షం కురుస్తుండగా.. జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఇవాళ తెల్లవారుజాము నుంచే భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.. మధ్యాహ్నం వరకే తెలంగాణలో 15 సెంటీ మీటర్లు, హైదరాబాద్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 3.3 సెంటీ మీటర్ల వర్షం నమోదు కాగా.. రాష్ట్రంలోని 14 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
గులాబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని అలాగే… ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలని పేర్కొన్నారు నారా చంద్రబాబునాయుడు. రాష్ట్రంలో గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని… తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలిపారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని…. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండంతో పంటలకు తీవ్ర నష్టం…
బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడింది. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఈ ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తున్నది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, గచ్చిబౌలీ, రాజేంద్రనగర్, జీడిమెట్ల, కొంపల్లి, కుత్భుల్లాపూర్, అంబర్పేట్ తో పాటుగా నగరంలోని అనేక ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టుప్రాంతంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తుఫాన్…
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో గులాబ్ తుఫాన్ గోపాల్పూర్-కళింగపట్నం వద్ధ తీరం దాటింది. కళింగపట్నానికి 20 కిలోమీర్ల దూరంలో ఉత్తరభాగంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటే సమయంలో 95 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. ఇక ఆదివారం ఉదయం నుంచే శ్రీకాకుళం జిల్లాలో వానలు దంచికొట్టాయి. కళింగపట్నం వద్ద తీరం దాటటంతో ఆ పట్టణం అతాకుతలం అయింది. ఆదివారం రోజున 19.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాతో పాటుగా విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తారంగా…