సీఎం కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇంటర్నేషనల్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేసి పట్టా తీసుకున్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే వేడుకకు హిమాన్షు తాత, నాయనమ్మలైన సీఎం కేసీఆర్, శోభ దంపతులు.. తల్లిదండ్రులు కేటీఆర్, శైలిమ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
అరోరా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ యొక్క స్నాతకోత్సవ వేడుకలు హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించారు.. అరోరాస్ కాలేజీ స్నాతక్ 2022 పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ లింబాద్రి, సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ముఖ్య అతిథులుగా విచ్చేసి విద్యార్థులకు పట్టాలు అందజేశారు.. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ప్రెసిడెంట్ కరుణ గోపాల్, సీ.ఆర్. రావుస్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ వెంకటరామన్, అరోరాస్ కళాశాల చైర్మన్…