హుస్సేన్ సాగర్ లో నిర్వహిస్తున్న 37వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ గ్రాండ్ గా ముగిసింది. ఈ క్లోజింగ్ సెర్మనీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. అయితే.. ఈ ఈవెంట్ లో గెలిచిన విన్నెర్స్ కి గవర్నర్ ట్రోఫీ లని అందించారు. హుస్సేన్ సాగర్ లో వారం రోజులపాటు నేషనల్ ర్యాంకింగ్ ఈవెంట్ జరిగింది. లేసర్ క్లాస్, లేసర్ స్టాండర్డ్, లేసర్ 4.7 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి.
నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం కానుంది. నేడు ముంబై వేదికగా చైన్నై-కోల్కత్తా జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు, రేపు స్టాంప్డ్యూటీల కోసం 52 ఎస్బీఐ బ్రాంచీలు పనిచేయనున్నాయి. స్టాంపులు, రిజస్ట్రేషన్ల శాఖ ఐజీ విజ్ఞప్తితో ఎస్బీఐ…