Minister Sridhar Babu: ఈనెల 19న మరోసారి ముఖ్యమంత్రి, ఉన్నతాధికారుల బృందం దావోస్కు వెళ్తున్నారని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. మంగళవారం నిర్వహించిన శాసన మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఐదున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. మళ్ళీ పెట్టుబడుల కోసం దావోస్ పర్యటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్ టూరిజం తీసుకొచ్చాం.. త్రీ ట్రిలియన్ డాలర్లు ఏకానమి చేయాలనేది మా ఆలోచన, దృక్పథం అని పునరుద్ఘాటించారు.…