హైదరాబాద్ నగరంలో మరొక భారీ మోసం వెలుగు చూసింది.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఏకంగా 150 కోట్ల రూపాయలను కొట్టేశారు.. ది పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సంస్థ కుచ్చు టోపీ పెట్టింది.. సెక్యూరిటీ బాండ్ల రూపంలో లాభాలు ఇస్తామని చెప్పి 1500 మంది కస్టమర్ల దగ్గర నుంచి 150 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు మోసగాళ్లు.. కాగా.. సెక్యూరిటీ సంస్థను ఇద్దరు దంపతులు నడుపుతున్నారు..