బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ప్రారంభం అవనుంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య నవంబర్ 22 నుంచి మొదటి టెస్ట్ ఆరంభం అవుతుంది. న్యూజీలాండ్ చేతిలో దారుణ ఓటమి నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ సహా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు కీలకంగా మారింది. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలన్నా.. ఆస్ట్రేలియాపై సిరీస్ను 4-0తో కైవసం చేసుకోవాలి. ఆసీస్ జట్టుపై గెలుపు కోసం గౌతీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో భారత…
రోజంతా అంటే 11 గంటలు దాదాపు నాలుగు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించడం ఈజీ అవుతుంది అని క్వశ్చన్ వచ్చింది. ఈ క్రమంలో 11 గంటలు బ్యాటింగ్ చేసే బ్యాటర్ విషయంలో గంభీర్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు. టాప్ -7లోని బ్యాటర్లంతా ఆడగలరు అని చెప్పుకొచ్చాడు.
Gowtham Gambhir: న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో 0-3తో ఘోర పరాజయం తర్వాత గౌతం గంభీర్ తొలిసారిగా మౌనం వీడాడు. స్వదేశంలో న్యూజిలాండ్పై 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. భారత కోచ్గా గౌరవనీయమైన పాత్రను పోషించడం చాలా కష్టమని, అది తనకు తెలుసునని అన్నాడు. న్యూజిలాండ్తో ఓటమి 2012 తర్వాత స్వదేశంలో భారత్కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కాగా..…
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. జట్టుపై కోచ్ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్కు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్ సిరీస్ ఓటమి బాధ్యతను సీనియర్లకు…
బెంగళూరులో న్యూజిలాండ్తో తొలి టెస్టులో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్లో విఫలమైన బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో బాగా ఆడారు. కానీ సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఒక్కడే దారుణంగా విఫలమయి.. జట్టులో తన స్థానాన్ని ప్రమాదంలో నెట్టేసుకున్నాడు. రాహుల్ జట్టులో ఎందుకు అంటూ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ చేయడంతో రాహుల్కు రెండో టెస్టుల్లో అవకాశం కష్టమేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్…
Gautam Gambhir About Team India Batting: బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ను క్లీన్స్వీప్ చేసిన భారత్.. మరో సిరీస్కు సిద్ధమవుతోంది. బుధవారం నుంచి న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాతో కాన్పూర్లో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. వర్షం కారణంగా రెండున్నర రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. రోహిత్ సేన దూకుడు కారణంగా అద్భుత విజయం సాధించింది. కివీస్తో సిరీస్లో కూడా అలానే ఆడతారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది.…
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి పుంజుకుంటాడని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. విరాట్ ప్రపంచ స్థాయి క్రికెటర్ అని, అరగేంట్రం చేసినప్పుడు ఉన్న పరుగుల దాహం అతడిలో ఇప్పటికీ ఉందన్నాడు. కివీస్, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్ల్లో కోహ్లీ తిరిగి ఫామ్లోకి వస్తాడని గంభీర్ పేర్కొన్నాడు. 2024లో మూడు టెస్టులు ఆడిన విరాట్.. 50 ప్లస్ స్కోర్ సాధించలేకపోయాడు. దీంతో అతడి ఫామ్పై విమర్శలు వస్తున్నాయి. ఈ…
Mayank Yadav About Gautam Gambhir: మయాంక్ యాదవ్.. ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు. నిలకడగా 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ.. బ్యాటర్లను భయపెడుతుండడమే అందుకు కారణం. గాయం నుంచి కోలుకొని నేరుగా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ పేస్ సంచలనం.. ఆదివారం గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అంతేకాదు తొలి మ్యాచ్ మొదటి ఓవర్నే మెయిడిన్…
కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడుతోంది. వర్షం కారణంగా కేవలం నాలుగు సెషన్ల ఆట మాత్రమే సాగినా.. మ్యాచ్లో రోహిత్ సేన ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి ఇన్నింగ్స్లో బంగ్లాను 233 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్లో 285/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి 52 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి రెండో ఇన్నింగ్స్లో బంగ్లా ఓపెనర్లను పెవిలియన్ చేర్చింది. ప్రస్తుతం బంగ్లా స్కోర్…
భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదన్నాడు. ఏ పరిస్థితుల్లో అయినా చివరి వరకూ పోరాడాలనే బలంగా భావిస్తాడన్నాడు. ప్రస్తుతం భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్లో వాతావరణం చాలా బాగుందని రోహిత్ పేర్కొన్నాడు. మొన్నటివరకు రాహుల్ ద్రవిడ్తో కలిసి పనిచేసిన హిట్మ్యాన్.. ఇప్పుడు గంభీర్తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ సందర్భంగా జియో…