తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గంగుల కమలాకర్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్ దీపక్ శర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యాసంగి ధాన్యం సీఎంఆర్లో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎఫ్సీఐ సహకరించాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. అంతేకాకుండా ఇక్కడి వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దని, గన్నీలు, గోదాములు, ర్యాకుల కేటాయింపు పెంచాలని ఆయన విన్నవించారు. ప్రతీ నెల 9 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకోవాలని ఆయన అన్నారు.…