మొదటి పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతి మార్చేందుకు సిద్ధం అవుతుంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ).. దీనిపై ప్రతిపాదనలతో ముందుకొచ్చింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ తరహాలో పైప్డ్ గ్యాస్ రాజధానిగా అమరావతిని చేస్తామంటోంది ఐవోసీ.. ఇక, దీనికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.. కావాల్సిన సహకారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు..