‘ఈ యుగం నాది’ అని శ్రీశ్రీ చెప్పడంలో కొందరికి ఆనాడు అతిశయోక్తిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈ నాటికీ ఏ సందర్భంలోనైనా మహాకవి శ్రీశ్రీని, ఆయన కవితలను తలచుకోకుండా ఉండలేం!ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా దానికి శ్రీ శ్రీ గీతానికి అన్వయిస్తూ ఆలోచించడం రెండు మూడు తరాలకు అలవాటుగా మారిపోయింది. భవిష్యత్ లోనూ అదే సాగుతుంది. 1910లో విశాఖ పట్నంలో సంప్రదాయ కుటుంబంలో పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావుకు పదిహేనేళ్ళ వయసులోనే వెంకట రమణమ్మతో వివాహం జరిగింది.…