హైదరాబాద్లోని అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా సాంకేతిక రంగంలో మరో మెట్టు పైకి ఎక్కింది. కాలేజీ ఛైర్మన్ అక్కినేని నాగార్జున, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కలిసి మంగళవారం నాడు అత్యాధునిక ‘డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్ఈ మిక్స్’ స్టూడియోను ప్రారంభించారు. సినిమా రంగంలో మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇచ్చేందుకు ఈ స్టూడియోను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. సినిమాకు ప్రాణం పోసేది మ్యూజిక్ మాత్రమే…