అగమ్యగోచరంగా ఖమ్మం మిర్చి రైతుల పరిస్థితి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిర్చి రైతుల కంట కన్నీరు ఆగడం లేదు. పంటలు పండకపోవటంతో భారీ నష్టాల్లో కూరుకుపోయారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మిర్చి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీకావు. గత యేడాది మిర్చి సాగు చేసిన రైతుల పంట పండింది. ఎగుమతులు సైతం పెరిగాయి. విదేశాల నుంచి ఆర్డర్లు కూడా వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో 18 వేల పైచిలుకు ధర పలుకుతోంది. గతంలో ఏసీ మిర్చికి మాత్రమే ఈ ధర ఉండేది. భూములను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు రైతులు. ఖమ్మం జిల్లాలో గత యేడాది 55 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయగా ఈ యేడాది లక్షా 20 వేల ఎకరాల్లో మిర్చి వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత యేడాది కేవలం పది వేల ఎకరాల్లోనే మిర్చి సాగు చేయగా ఈ యేడాది మాత్రం 30 వేల ఎకరాల్లో పంట వేశారు.
Also Read
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
- MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
ఈ యేడాది మంచి ధర ఉన్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. మిర్చికి చీడపీడలు వ్యాపించాయి. పురుగు మందులు కొట్టినా వదలడం లేదు. దిగుబడి పూర్తిగా పడిపోయింది. మొత్తం పంటలు సర్వ నాశనం అయ్యాయి. రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. వ్యవసాయ అధికారులు పంటల పరిశీలనకు వచ్చి చేతులెత్తాశారు. పంట మార్పిడి చేయాలని వ్యవసాయ అధికారులు ఉచిత సలహా ఇచ్చేసి వదిలేస్తున్నారు. తాము పంట మార్పిడి చేసినా ఈ ఏడాది పురుగు దాడి చేసిందని చెబుతున్నారు రైతులు. గత యేడాది పత్తి సాగు చేయగా…ఈ యేడాది మిర్చి సాగు చేశామని చెబుతుంటే అధికారులు మాత్రం తెల్లమొహం వేస్తున్నారు.

దిగుబడి రాకపోవటంతో చేసేదేమి లేక పంటంతా పీకేస్తున్నారు. జెసిబిలతో తొక్కించి మళ్లీ ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కొంత మంది రైతులు అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో అయిదుగురు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇక…ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలపై రాజకీయ పార్టీలు రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకుండా పోయింది. ఖమ్మం, మధిర, ఇల్లెందు ఏరియాల్లో పంట బారీగా నష్టపోయింది. ఇక్కడ పండే మిర్చి ఖమ్మం, గుంటూరు, జగదల్పూర్, నాగ్పూర్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంది. ఎకరానికి 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంది. తామర పురుగు దాడితో ఎకరానికి క్వింటా కూడా వచ్చే పరిస్థితి లేదు. ఫలితంగా సగానికి సగం దిగుబడులు పడిపోయాయి. మరోవైపు…మిర్చి సాగు చేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఉద్యమాలు సాగుతున్నాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికారులకు వినతి పత్రాలను అందించారు.
సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పంట పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పంటలకు ఇంత నష్టం వస్తుంటే అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సగానికిపైగా తోటలు దెబ్బతిని.. దున్నుతుంటే ప్రజాప్రతినిధులు, అధికారులు కనీసం పొలాలవైపు వెళ్లడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర, జాతీయ ఉద్యాన శాఖ శాస్త్రవేత్తల బృందాలు పర్యటించి వెళ్లారు. సమగ్ర సస్య రక్షణ చర్యలు సూచించినా ఏమాత్రం ఫలితం రావడం లేదు. నకిలీ విత్తనాల మీద కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. తెగుళ్ల ను పరిశీలించాల్సిన వ్యవసాయ శాఖ కనిపించకుండా పోయింది. రైతులకు సలహాలు ఇచ్చే వారే లేకుండా పోయారు. ఫలితంగా మిర్చి సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
తాజావార్తలు
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
-
YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!