కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకని వంద మంది మహిళలు యాదాద్రి భువనగిరిలో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందులో 20 మందికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. ఆపరేషన్ చేయబోమంటూ డాక్టర్లు చేతులెత్తేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.తుర్కపల్లి, రాజపేట్ మండలాల నుంచి వంద మంది మహిళలను బీపీఎల్ క్యాంపు తీసుకొచ్చారు. ఒకేసారి వంద మంది రావడంతో మేము కొంతమంది ఆపరేషన్ చేస్తామని చెప్పి మిగిలిన వారికి చేయమని డాక్టర్లు చెప్పారు.…