రేపే రంగుల పండుగ హోలీ. ఈ పండుగను ఆనందంగా జరుపుకొనేందుకు చిన్నారులు, యువతీయువకులు, పెద్దలు సిద్ధమయ్యారు. అయితే రంగుల విషయంలో జాగ్రత్తలు పాటించక పోతే ప్రమాదం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి పూర్వం సహజ సిద్ధ రంగులైన.. హెన్నా, పసుపు, కుంకుమ, చందనం, బుక్క గులాలు, మో దుగ పూలతో తయారు చేసిన రంగులు, టమాట గింజలతో తయారు చేసిన పొడిని పూసుకునే వారు. వీటి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.