Putin: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ప్రపంచంలోనే అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించారు. ఈ నేపథ్యంలో, భారత్, చైనాలు గత ఘర్షణలను మరించి స్నేహంగా మెలగాలని నిర్ణయించుకున్నాయి. దీనికి ఇటీవల చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఏడేళ్ల తర్వాత ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ-జిన్పింగ్-పుతిన్ ఉల్లాసంగా మాట్లాడుకుంటున్న ఫోటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్గా మారింది.