రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగం అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంటనూనెలు, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వల్ల త్వరలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. సెమీకండక్టర్ చిప్స్ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్ ఎగుమతిలో ఉక్రెయిన్, రష్యాలే సింహా భాగాన్ని ఆక్రమించాయి. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క…
మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.…