18వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై…
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్లైన్ని గురువారం ఆవిష్కరించింది.