విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇంటర్మీడియట్ బోర్డులో సంస్కరణలకు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పచ్చజెండా ఊపారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ 77వ సమావేశం అమరావతి అసెంబ్లీలోని పేషిలో మంత్రి లోకేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఇంటర్మీడియట్లో విద్యలో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు ఆకర్షించేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. గడిచిన ఎనిమిది సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పూర్తిగా విఫలమైందన్నారు.. కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య హామీ ఏమైంది? అని ప్రశ్నించారు.. రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ విద్యాలయాలను నిర్విర్యం చేస్తూ ప్రైవేట్ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తుందని ఆరోపించిన ఆయన.. రాబోయే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల పాఠశాలలు బలోపేతం…