DOST 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త! ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాల కృష్ణ రెడ్డి , కళాశాల విద్యా శాఖ కమిషనర్ శ్రీ దేవ సేన సంయుక్తంగా డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ (దోస్త్) 2025-26 నోటిఫికేషన్ను విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సందర్భంగా చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ, ఈసారి మూడు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని…