పంజాబ్ లో ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగానే ఫలితాలు వస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ సోమ్నాథ్ భారతి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మార్చి 10న పంజాబ్లో ఆప్ అధికారంలోకి రాబోతుందని ఆయన అన్నారు. ఉత్తరాఖాండ్, గోవా రాష్ట్రాలలో కూడా మెరుగైన ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని ఆయన వెల్లడించారు. మా పార్టీ కార్యకర్తల కృషి వల్ల మెరుగైన ఫలితాలు రాబోతున్నాయని,…