ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఈ-విటారా కారును భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ- విటారా ఎస్యూవీ లాంచ్కు సిద్ధమవుతోంది. మార్చి 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. జపాన్, యూరప్లతోపాటు 100కి పైగా దేశాలకు ఈ-విటారా కారును ఎగుమతి చేస్తామని మారుతి సుజుకి వెల్లడించింది. ఇటీవల ఈ-విటారా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కలిగించింది.
ఎలక్ట్రిక్ కార్లపై (EV) బంపర్ డిస్కౌంట్ల సీజన్ కొనసాగుతోంది. వాస్తవానికి.. డీలర్షిప్ మిగిలిన స్టాక్ను విక్రయించేందుకు భారీ తగ్గింపులను ప్రవేశపెట్టాయి. 2024 సంవత్సరం ప్రారంభంలో విడుదలైన టాటా పంచ్ ఈవీపై గరిష్టంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గింపును ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఎలక్ట్రిక్ కార్లతో పాటు, ద్విచక్ర వాహనాలపై కూడా స్టాక్ క్లియరెన్స్ విక్రయాలు అందుబాటులో ఉన్నాయి.