Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో అధికారంలో వచ్చింది. గత నాలుగు రోజులుగా ప్రభుత్వ ఏర్పాటు, సీఎం ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం విస్తృతంగా చర్చలు నిర్వహించింది. చివరకు సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది. వీరిద్దరు కూడా శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీ పరమేశ్వర పార్టీ అధిష్టానికి హెచ్చరికలు చేశారు.