సైకిల్ ట్రాక్ పైకప్పును తొలగించడంపై హెచ్ఎండీఏ వివరణ ఇచ్చింది. నార్సింగి, పుప్పాలగూడ ప్రాంతాల నుంచి నానక్రామ్గూడ రోటరీ మీదుగా ఐటీ కారీడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్ ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో రాకపోకలు కొనసాగుతున్నాయని తెలిపింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో నానక్రామ్గూడ రోటరీ మొత్తం స్తంభిస్తున్నట్లు వెల్లడించింది.