ఇరాన్ అత్యున్నత నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం జమ్మూ కాశ్మీర్లో తీవ్ర అలజడి సృష్టించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించారన్న వార్త తెలియగానే శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు అధికారులు శ్రీనగర్ అంతటా మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు లోయలో అదనపు భద్రతా బలగాలను మోహరించారు. Vishnu…