Off The Record: సెక్రటేరియట్ గోడలకు చెవులు పెరిగిపోయాయి. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై అలా చర్చించి, చర్చించగానే ఇలా కొన్ని బయటపడుతున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధాలవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి లీకుల భయం పట్టుకుంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని ఘటనలు మర్చిపోక ముందే మళ్ళీ ప్రభుత్వ సమాచారం క్షణాల్లో ప్రతిపక్షాలకు చేరుతోంది. ప్రభుత్వంలోని ముఖ్య శాఖల్లో జరిగే నిర్ణయాలు బయటకు లీక్ అవుతున్నాయని భావిస్తున్నారు. అంతర్గత సమావేశాల సారాంశం ప్రభుత్వ పెద్దల కంటే ముందే ప్రతిపక్షానికి…
కాళేశ్వరం కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు రాష్ట్రంలో వికృత, వికార మైన విధానాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.జ్యుడీషియల్ కమిషన్ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ కు నోటీసులు పంపిస్తే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు..