తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్…