రాజస్థాన్లోని చురు జిల్లాలోని భానుడా గ్రామం సమీపంలో బుధవారం జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్ప కూలింది. ఈ ఘటనలో భారత వైమానిక దళం (IAF) కు చెందిన ఇద్దరు పైలట్లు మరణించారు. గత ఐదు నెలల్లో జాగ్వార్ విమానాలు కూలిపోవడం ఇది మూడో సారి అని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం ఓ పొలంలో కూలింది. పైలట్ల మృతదేహాలు ఛిద్రం అయ్యాయి.