మహారాష్ట్రలోని పూణెలో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో విస్తుగొల్పే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సొంత సోదరీమణులే ఈ హత్య చేయించినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.