ఓఎన్జీసీలో అసిస్టెంట్ అకౌంటెంట్గా పని చేస్తున్న చంద్ర కిషోర్, అతని కుమారులు జోషీల్, నిఖిల్ మృతదేహలను బంధువులు సొంత ఊరు తాడేపల్లిగూడెం తీసుకుని వెళ్లారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు తీసుకెళ్లారు. కాకినాడ జీజీహెచ్లో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. రెండు రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టులు వస్తాయని వైద్యులు చెప్పారు. చంద్ర కిషోర్ ఆత్మహత్య చేసుకున్నట్లుగానే వైద్యులు ప్రాథమికంగా చెబుతున్నారు. మెడకు ఉరితాడు బిగించుకుని ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్ర కిషోర్ కుటుంబం, కంపెనీలో…