Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.