ACB Raid: పెండింగ్లో ఉన్న క్యాటరింగ్ బిల్లు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి.. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబట్టారు.. మూడు లక్షలు లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన కరిముల్లా క్యాటరింగ్ కాంట్రాక్టు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాటరింగ్ ఆర్డర్ కరిముల్లా దక్కించుకున్నారు. అయితే, క్యాటరింగ్…