Jallikattu Tragedy: తమిళనాడు రాష్ట్రంలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివగంగై జిల్లా సిన్గంపునారి సమీపంలో నిర్వహించిన జల్లికట్టు పోటీలలో ఈ ఘటన జరిగింది. పోటీల సందర్భంగా అదుపు తప్పిన ఎద్దులు ప్రేక్షకులపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, 76 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే…