పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారిపోతున్నాయి. తాజాగా సోమవారం తెల్లవారుజమున ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని నివాసాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 13 మంది చనిపోయారు.
అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కువైట్ విమానాశ్రయంతో సహా అమెరికా స్థావరాలపై ఇరాన్ బాంబు దాడులు చేసింది. అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు దాడి చేయడం ఇది 88వ సారి కావడం విశేషం.