గత రెండు రోజులుగా లెబనాన్లో కమ్యూనికేషన్ పరికరాలు పేలుళ్లు హడలెత్తించాయి. ఆ ఘటనలో ఇప్పటి వరకు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 3000 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా దక్షణి లెబనాన్పై బాంబుల వర్షం కురిసింది. దీంతో మరోసారి లెబనాన్ వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడినట్లుగా హిజ్బుల్లా చీఫ్ ప్రకటించారు.