టెక్ సిటీ బెంగళూరును భారీ వరద ముంచెత్తింది. మంగళవారం రికార్డ్ స్థాయిలో వర్షం కుమ్మేసింది. దీంతో రోడ్లు, ఇళ్లు నీటమునిగాయి. కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిన్నెలతో నీళ్లు బయటకు పంపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.