ఆయుర్వేదంలో శస్త్రచికిత్సలు (ఆపరేషన్లు) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అల్లోపతి వైద్యులు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రోగుల భద్రతకు ముప్పుగా మారవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, నైపుణ్య శిక్షణను పూర్తిచేసుకున్న ఆయుర్వేద పీజీ వైద్యులు మొత్తం 58 రకాల శస్త్రచికిత్సలను స్వతంత్రంగా నిర్వహించుకునేలా అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం…