Pakistan: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భేటీ అయ్యారు. వైట్ హౌజ్లో ట్రంప్, మునీర్కి లంచ్ ఆతిథ్యం ఇచ్చారు. ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణ సమయంలో ఈ భేటీ జరిగింది. ఇరాన్ గురించి పాకిస్తాన్కి అందరి కన్నా బాగా తెలుసు అని ట్రంప్ విలేకరులతో అన్నారు. ట్రంప్తో జరిగిన భేటీలో ఆసిమ్ మునీర్తో పాటు ఐఎస్ఐ చీఫ్ ఆసిమ్ మాలిక్ కూడా పాల్గొన్నారు.