MP: మధ్యప్రదేశ్ రాష్ట్రం నర్మదాపురం జిల్లాకు చెందిన ఆరిఫ్ ఖాన్ చిష్తి తన అనే ముస్లిం యువకుడు కుల, మతాలను పక్కనపెట్టాడు. తన కిడ్నీని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ మహారాజ్కు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆరిఫ్ ఖాన్ ప్రేమానంద్ మహారాజ్, జిల్లా యంత్రాంగానికి ఒక లేఖ పంపారు. జాతీయ ఐక్యత కోసం ప్రబోధించే ప్రేమానంద్ దీర్ఘాయుష్షుతో జీవించాలని, తద్వారా దేశ సమగ్రతను కాపాడటంలో ప్రత్యేక కృషి చేయాలని కోరాడు.