పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగంపై కూడా పడుతోంది. వంట గ్యాస్ వినియోగాన్ని తగ్గిస్తూ.. చాలా మంది ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. మార్చి 7న రికార్డు స్థాయిలో 274.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం 9.15 శాతం అధికంగా ఉంది. మార్చి 12, 13, 14 తేదీల్లో…