ట్విట్టర్కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ ‘కూ’(Koo) యాప్ కు ఇప్పుడిప్పుడే యూజర్లు వస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ‘కూ’ యాప్ ను ప్రోత్సహిస్తూ జాయిన్ అవుతున్నారు. కాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ‘కూ’ యాప్ లో జాయిన్ అయ్యారు. యూజర్లకు మాతృభాషలో సంభాషించేందుకు వీలు కల్పిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి జగన్ ఈ యాప్ లో చేరినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎంఓ ఆంధ్రప్రదేశ్ మరియు ఏపీ డిజిటల్ కార్పొరేషన్…
కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను దేశవ్యాప్తంగా వేగవంతం చేశారు. అయితే, అవసరమైనన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉండటం లేదని, వ్యాక్సిన్లు సరిపడా అందించాలని అనేక రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాయనున్నారు. సరిపడా వ్యాక్సిన్లు అందించాలని కోరుతూనే, ప్రైవేట్ ఆసుపత్రులకు కేటాంచిన డోసుల్ని ఆయా ఆసుపత్రులు సరిగా వినియోగించుకోలేకపోతున్నాయని కేంద్రం దృష్టికి…
తాడేపల్లిలో సిఎం వైఎస్ జగన్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొన్నది. జాబ్ క్యాలెండర్కు నిరసనగా విద్యార్ధి సంఘాలు ఛలో తాడేపల్లి కార్యక్రమాన్ని తలపెట్టాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇంటిని ముట్టడికి విద్యార్ధి సంఘాలు ప్రయత్నం చేశాయి. సీఎం వైఎస్ జగన్ నివాసం వైపు వెళ్లేందుకు టీఎన్ఎస్ఎఫ్ ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, కార్యకర్తలకు మద్య తోపులాట జరగింది. పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, సీఎం నివాసం వద్ద పోలీసులు భారీగా…
విద్యారంగంలో నాడు- నేడు, విద్యాకానుకలపై నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలన్నారు. ఆగస్టులోపు విద్యా సంస్థల్లో నాడు-నేడు పెండింగ్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. జులై 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్ బుక్కులపై…
టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కోచ్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. ముందుగా సీఎం జగన్ కు పుష్పగుచ్చం ఇచ్చిన కుంబ్లే.. తన క్రికెట్ ప్రయాణానికి సంబంధించిన ఫ్రేమ్ ను అందించారు. అనంతరం ఆయనతో కలిసి కూర్చుని ఏపీలో క్రీడారంగం అభివృద్ధిపై చర్చించారు. ఈ మీటింగ్ మర్యాదపూర్వకంగా అని చెబుతున్నా.. కానీ కుంబ్లే ఆంధ్రలో క్రికెట్ అకాడమీ మొదలుపెట్టాలని…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటులన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు వాహనమిత్ర సాయం అందించింది. కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధిక సాయం చేస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆన్లైన్ ద్వారా వాహనమిత్ర సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయబోతున్నారు. ఈ వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్షలమంది…