AP Budget 2026-27: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లగా అంచనా వేశారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు, ద్రవ్య లోటు రూ. 75,868…
AP Budget 2026 Live Updates: ఆర్ధికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. ఈ బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బడ్జెట్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఎన్టీవీని చూస్తూ ఉండండి..
వివిధ అభివృద్ధి పథకాలకు భారీగా నిధులను కేటాయించిన కూటమి ప్రభుత్వం. బడ్జెట్లో డ్రిప్ ఇరిగేషనుకు పెద్ద పీట వేసింది.. 85 వేల హెక్టార్లను డ్రిప్ ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది.. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, పశువుల పాకలు వంటి 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్టు బడ్జెట్లో వెల్లడించింది..