ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకున్న మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కల్తీసారా మరణాలపై చర్చకు పట్టుబడితే నిన్న 5గురు, ఇవాళ 11మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. అసెంబ్లీలో నిన్న ముఖ్యమంత్రి ప్రకటన వ్యక్తిగతమని మండలిలో బొత్స ప్రకటించారని, సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు…