AP High Court: అధికారుల నిర్లక్ష్యంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్జెడ్ (CRZ) నిబంధనలకు విరుద్ధంగా సముద్రానికి అతిసమీపంలో కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా అధికారుల నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంక్రీట్ గోడ నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. బాధ్యులైన అధికారులను రక్షించేందుకు జీవీఎంసీ కమిషనర్ ప్రయత్నిస్తున్నారనే…
AP High Court: హిడ్మా ఎవరు అని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. హిడ్మా, హిడ్మా భార్య రాజక్క ఎన్కౌంటర్పై జ్యుడీషియల్ విచారణ చేయాలని హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా పిటిషనర్ను హిడ్మా ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. మావోయిస్టు గ్రూప్ కమాండర్ హిడ్మా అని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. హిడ్మా, ఆయన భార్యను ఎన్ కౌంటర్కు ముందే అదుపులోకి తీసుకుని మూడు రోజులు టార్చర్ చేశారని పిటిషనర్ కోర్టుకు వివరించారు. ఇది ఫేక్ ఎన్…